పగడం దరిస్తున్నారా.. ఏ రాశి వారికి మంచిదో తెలుసా!

 

పగడం దరిస్తున్నారా.. ఏ రాశి వారికి మంచిదో తెలుసా!

హిందూ మతంలో రత్నాలు ధరించడం జాతకాలను ప్రభావితం చేస్తుందని చెబుతారు.  తొమ్మిది రత్నాలను ప్రముఖమైనవిగా చెబుతారు. వాటినే నవరత్నాలు అని అంటారు.  నవరత్నాలలో పగడం కూడా ఒకటి.  ముదురు ఎరుపు రంగులో ఉండే పగడం శుక్ర గ్రహానికి సంబంధించినది. వ్యక్తుల ధైర్యాన్ని, శౌర్యాన్ని మరియు ఆత్మవిశ్వాసాన్ని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. జాతకంలో కుజ గ్రహం బలహీనంగా ఉన్నవారు తరచుగా తెలియని భయాలు, ఆత్మవిశ్వాసం లేకపోవడం మరియు నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. అందుకే, జాతకంలో కుజ గ్రహం అసమతుల్యంగా ఉన్నప్పుడు, దానిని సమతుల్యం చేయడానికి పగడాన్ని ధరించమని చెబుతుంటారు. అయితే పగడం  అందరికీ సరిపోదు.  ఏ రాశుల వారికి పగడం ధరించడం మంచిది?  ఏ రాశుల వారికి ఇది మంచి ఫలితాలు ఇస్తుంది? తెలుసుకుంటే..

పగడం.. ఈ 5 రాశులకు వరం..

మేషం..

మేష రాశికి అధిపతి కుజుడు, కాబట్టి ఈ రాశిలో జన్మించిన వారికి పగడం ఒక అదృష్ట చిహ్నంగా పనిచేస్తుంది. పగడాన్ని  ధరిస్తే  మేష రాశి వారి నాయకత్వ సామర్థ్యం మెరుగుపడుతుంది. తద్వారా వారు తమ వృత్తి , వ్యాపారం రెండింటిలోనూ విజయం సాధించగలుగుతారు.

వృశ్చికం..

వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. పగడాన్ని ధరించడం వృశ్చిక రాశి వారికి మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. ఈ రత్నం వారికి ఏకాగ్రతను అందించి, వారి లక్ష్యాలను సాధించడంలో సహాయపడుతుంది.

సింహరాశి..

సింహరాశి వారికి పగడం చాలా శుభప్రదమైనదిగా పరిగణించబడుతుంది. దీనిని ధరిస్తే సింహ రాశి వారు   నిర్ణయాలు తీసుకునే   సామర్థ్యం గణనీయంగా మెరుగవుతుంది.  పనిలో పదేపదే అడ్డంకులను ఎదుర్కొంటున్నట్లయితే, ఆ అడ్డంకులను తొలగించడంలో పగడం సహాయపడుతుంది.

ధనుస్సు..

ధనుస్సు రాశి వారు తరచుగా కష్టమైన పరిస్థితులలో ఆందోళనకు గురవుతారు. పగడం ఈ భయాన్ని తొలగించి వారి జీవితాలకు స్థిరత్వాన్ని ఇస్తుంది. జ్యోతిష్య సలహా తీసుకున్న తర్వాత దీనిని ధరించడం వల్ల మనస్సు ప్రశాంతంగా, ఏకాగ్రతతో ఉండటానికి సహాయపడుతుంది.

మీన రాశి..

మీన రాశి వారు తరచుగా గందరగోళం లేదా సందిగ్ధంలో చిక్కుకుంటారు. పగడం వారికి మానసిక బలాన్ని అందించి, స్పష్టమైన ఆలోచనతో స్పష్టమైన నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది.

పగడాన్ని ఎలా ధరించాలంటే..

జ్యోతిష్య నియమాల ప్రకారం, పగడాన్ని ఎల్లప్పుడూ బంగారం లేదా రాగి ఉంగరంలో పొదిగి ధరించాలి. మంగళవారం ఉదయం సూర్యోదయం తర్వాత దీనిని ధరించడం  శుభప్రదం. ఉంగరాన్ని ధరించే ముందు, దానిని పచ్చి పాలు , గంగాజలంలో అభిషేకం చేసి శుద్ధి చేసుకుంటే మంచిది. ఆ తర్వాత, కుజ బీజ మంత్రమైన "ఓం క్రాం క్రీం క్రౌం సహ భౌమాయ నమః"ను 108 సార్లు జపించాలి. అనంతరం పగడాన్ని  కుడి చేతి ఉంగరపు వేలికి ధరించాలి.

                                 *రూపశ్రీ.